Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: సంబరాల దీపావళి | Sambarala Deepavali | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
సంబరాల దీపావళి
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
మన హైందవుల ప్రతి పండుగా అందరికీ ఆనందదాయకమే. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లు పండుగ పర్వదినాల్లో ఎవరి స్థితివారు... సంబరంగా గడుపుతారు. ఆనందానికి కలిమిలేములు హద్దులు కావు. మనస్సు ముఖ్యం...
ఆరోజు ఆదివారం. సమయం సాయంత్రం
ఆరుగంటలు ప్రాంతం.
అశ్విని తన తల్లి గాయత్రి, తండ్రి శాంతారావు, మేనత్త రుక్మిణి, ఆమె భర్త భాస్కర్, వారి పిల్లలు ధరణి, బలరాం, అపర్ణలతో కలసి ఐదు గంటల ప్రాంతంలో రెండు కార్లలో వారంతా బీచ్ కి వచ్చారు.
సముద్ర ఒడ్డున యిసుకలో కొన్ని చోట్ల దగ్గర దగ్గరగా దాదాపు పదిహేను చెక్క బోట్లు వున్నాయి. పిల్లలు నలుగురూ... హైడ్ అండ్ సీక్ ఆటను ఆడడం ప్రారంభించారు. మరి కొంతమంది వారి వారి పిల్లలు, కుటుంబ సభ్యులతో అక్కడికక్కడ బీచ్ లో కూర్చుని ఉన్నారు. పెద్దలు శాంతారావు... గాయత్రి, భాస్కర్... రుక్మిణి సరదాగా తమ కాలేజీ అనుభవాలను గురించి, ఉపాధ్యాయులు, లెక్చరర్ల గురించి... ఒకరి తర్వాత ఒకరు చెబుతూ ఉంటే మిగిలిన వారు వింటూ మధ్య మధ్యన చెప్పే వారిని ప్రశ్నలు అడుగుతూ, గత స్మృతులను తలచుకుంటూ, వారి వారి ధైర్య సాహసాల గురించి చెప్పుకుంటూ... ఆ సాగర తీరంలో చల్లని గాలిలో ఎంతో ఆనందంగా నవ్వుకొంటూ చెప్పే వారి మాటలు వింటూ ఉన్నారు. పిల్లలు నలుగురికి వయసు తేడా రెండేసి సంవత్సరాలు. అందరికంటే పెద్ద రుక్మిణీ కొడుకు భరణి. వాడి వయస్సు పదిహేను. అందరికంటే చిన్న అపర్ణ వయస్సు పదకొండు.
ఆ పెద్దలు నలుగురు ఎల్ఐసి ఆఫ్ ఇండియా లో మంచి హోదాలో పనిచేస్తున్నారు. గాయత్రి, సీతారామ్ లు వైజాగ్ లో... రుక్మిణి, భాస్కర్ లు హైదరాబాదులో ఉంటున్నారు.
భరణి టెన్త్... బలరాం ఎయిత్... అపర్ణ సిక్స్త్... అశ్విని ఎయిత్ చదువుతున్నారు. దీపావళి పండుగ... అందరూ కలిసి జరుపుకోవాలనే రుక్మిణి, భాస్కర్ లు పిల్లలతో వైజాగ్ వచ్చారు. శాంతారావు అక్క రుక్మిణి.
బలరాం కళ్ళు మూసుకున్నాడు. అశ్విని, భరణి, అపర్ణలు దాక్కునేదానికి ఇసుకలో ఉన్న బోట్ల వైపుకు పరిగెత్తారు. ఒక బోటుప్రక్కన దాక్కున్నారు. బలరాం కళ్ళు తెరిచి వారిని జనం వెనుక వెతకడం ప్రారంభించాడు. పిల్లలు ముగ్గురు మాట్లాడకుండా మౌనంగా బోటు చివర నుంచి బలరాం ఎలా తిరుగుతున్నది గమనిస్తున్నారు. ఆ బోటు లోపలి ఇరువురి వ్యక్తులు మరో వ్యక్తి వచ్చి వారిని కలిశాడు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/7acf7wO1gqo