Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: జస్ట్ వెయిట్ | Just Wait | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
'Just Wait' New Telugu Story Written By Vasundhara
'జస్ట్ వెయిట్' తెలుగు కథ
రచన: వసుంధర
(ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
రావణసంహారం చేసి అయోధ్యకు తిరిగొచ్చిన శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతోంది. ఉన్నట్లుండి లక్ష్మణుడు పెద్దగా నవ్వి వెంటనే వెనక్కి వాలిపోయాడు. అది నిద్రే ఐతే- మూర్ఛేమో అనిపించేటంత గాఢ నిద్ర.
అది నిద్రా, మూర్ఛా అన్న విషయం అక్కడున్నవారెవ్వరూ పట్టించుకోలేదు.
లక్ష్మణుడెందుకు నవ్వాడో తెలియక- రాముడు, భరతుడు, సీత, ఆంజనేయుడు వగైరాలు- ఆ నవ్వు తమ గురించేనని మనసులో చిన్నబుచ్చుకున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికున్నాయి కూడా.
ఐతే అసలు విషయం లక్ష్మణుడికి స్పృహ వచ్చేక తెలిసింది.
పద్నాలుగేళ్ల వనవాసంలో- క్షణమైనా దరికి రాకుండా నిద్రాదేవిని ఆపినవాడు లక్ష్మణుడు. అలాంటివాడు తనకు ప్రాణంకంటే ఎక్కువైన అన్నగారు శ్రీరామచంద్రుడి పట్టాభిషేకానికి ముహూర్త సమయం సమీపిస్తుంటే- ఆవేడుకని కళ్లారా చూడాలని మనసు ఉవ్విళ్లూరుతుంటే- ఒక్క క్షణమైనా నిద్రాదేవిని ఆపలేకపోతున్నాడు. ఆ అసహాయతకు ఏడవలేక నవ్వొచ్చిందిట లక్ష్మణుడికి. ఆ తర్వాత ఆశ్చర్యంతో మూర్ఛ వచ్చింది.
ఆ పుక్కిటి పురాణకథ ఇప్పుడెందుకు గుర్తొచ్చిందంటే-
కొన్ని నెలలుగా మా ఇంటిముందు కుళ్లుకాల్వకు మరమ్మతు జరుగుతుంటే పెద్దగా పట్టించుకోని మావారు- ఈ రోజు ఉన్నట్లుండి పెద్దగా నవ్వి స్పృహ కోల్పోతే- అది మూర్ఛో, నిద్రో తెలియక కలవర పడాల్సిన సమయంలో- ఊరటకోసం కాబోలు మనసు ఈ లక్ష్మణుడి కథని గుర్తు చేసింది.
మా ఇంటిముందున్న కుళ్లుకాల్వ మరమ్మతు కథ ఎంత పెద్దదంటే- లక్ష్మణుడి కథతో బ్రేక్ వెయ్యకపోతే, అది అంతులేని కథగా కొనసాగుతుండేదేమో!
అన్నట్లు మా ఇంటిముందు కుళ్లుకాల్వ నేపథ్యం మీకు తెలియదు కదూ….
అది సరిగ్గా మా ఇంటి ప్రహారీగోడనానుకుని ఉంది. దాన్ని కప్పుతూ వెడల్పైన సిమెంటు బ్లాక్సు టాపుగా ఉన్నాయి. మేము గేటు తియ్యగానే వేసే మొదటి అడుగు ఆ టాపు మీదే! ఆ టాపు మేము రోడ్దెక్కడానికి వారధి అన్నమాట!
వానొస్తే హైదరాబాదులో పల్లపు ప్రాంతాలు ములిగాయని వార్తల్లో విటుంటాం, చూస్తుంటాం.
నిజానికి హైదరాబాదులో మెట్ట ప్రాంతాలంటూ ఏమీ లేవు. ఏ ప్రాంతంలో గట్టిగా వాన పడితే ఆ ప్రాంతం ములిగిపోవడం ఖాయం. ములిగిన ప్రాంతాన్ని పల్లం అనడం ఇక్కడ రివాజు.
అలా ఒకసారి- వానా వరదా వచ్చి- మా కాలనీని పల్లపు ప్రాంతంగా మార్చి వెళ్లాయి. ప్రవాహం వడి ఎలా ఉందంటే- ఆ జోరుకి ఇంటిముందున్న కుళ్లుకాల్వ టాప్ బాగా పైకి లేచి దానికింద ఉన్న వైతరణి లాంటి కాల్వ దర్శనభాగ్యం కల్గించింది.
అంతవరకూ ఒక వారధిగా మాత్రమే గుర్తించబడిన ఆ టాప్- అన్నాళ్లుగా మమ్మల్నా కుళ్లు కంపునుంచి కాపాడుతూ మాకు చేసిన అసలు సేవ అప్పుడు గ్రహింపికొచ్చింది.
దేశంలో రాజకీయాలు, విలువలు, మానవత్వం- అన్నీ కుళ్లిపోయాయంటారు. ఆ కుళ్లంతా మా ఇంటిముందు కాల్వలోంచే పయనిస్తోందేమో మరి- కాల్వమీద టాపు లేవగానే ఒక్కసారి భరించలేని వాసన మా ఇంట్లో గుప్పుమంది.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/5fMMksarvCg