Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 4 | Pragathi Premikulu episode 4 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
Description:
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
'Pragathi Premikulu episode 4' New Telugu Web Series Written By Ch. C. S. Sarma
'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
దక్షిణేశ్వరంలో పూర్వం గురుదేవుల సన్నిధిలో జగన్మాత అనుభూతిని పొందినట్లు, వారి అక్కడొక దివ్య అనుభూతి కలిగింది. లోకంలో కనిపించే సమస్తమైన బాధ, దుఃఖం, అంధకారంలో వారి మనస్సు లీనమైంది. ఈ దృశ్యమాన అనేక తత్వాలకు వెనుకవుండే ఏకత్వాన్ని వారు యీ విచిత్ర మార్గాన కనుగొన నిశ్చయించుకొన్నారు. ఫలితంగా వారికి 'భీకరకాళీ దర్శనం' అయింది. భావావేశంతో జగన్మాతను గురించి పరవశంతో కవితను వ్రాశారు.
ఆ అనుభూతి వారిని అంతగా ఆవహించింది. కవిత వ్రాయడం పూర్తి కాగానే కలం వారి చేతినుండి జారి క్రింద పడిపోయింది. భావ సమాధి స్థితులైన స్వామీజీ మృతప్రాయులవలె పడిపోయారు.
ఆ తర్వాత శిష్యులతో భీషణ ఆరాధనను గురించి, జగన్మాత ప్రేమ వదనాన్ని చూడ్డాన్ని గురించి, తరచూ మాట్లాడ సాగారు. సెప్టెంబర్ 30వ తేదీన స్వామీజీ ఒంటరిగా ప్రసిద్ధ మాతృదేవాలయమైన 'క్షీరభవాని' కి వెళ్ళారు. అక్కడవారు ఆరు రోజులు కఠోరమైన తపస్సు చేశారు. ప్రతిరోజూ హోమం చేసి, పాలను జగత్ జననికి నివేదించారు. స్వామీజీ స్వభావం యిక్కడ పూర్తిగా మారిపోయింది.
నేత, కార్మికుడు, ఆచార్యుడు మొదలైన భావాలన్నీ వారి ఎరుక నుడి మాయమై పసిబిడ్డగా మారిపోయారు.
ఆరురోజుల తర్వాత శిష్యులు వున్న చోటికి స్వామీజీ తిరిగి వచ్చారు. తన అనుభవాలను వారికి వివరిస్తూ యిలా అన్నారు. నాలోవున్న దేశభక్తి, అభిమానం, పథకలా స్థానంలో, యిప్పుడు నిలచి వున్నది 'అమ్మ.. అమ్మ' మాత్రమే.
ఒకరోజు స్వామీజీ గతంలో నాశనం గావించబడి, శిధిల స్థితిలో వున్న ఆ ఆలయంలో కూర్చొని వారు ఇలా ఆలోచించారు.
"నేను గనక అప్పుడు వుండివుంటే, నా రక్తాన్ని ధారపోసి యీ ఆలయాన్ని పరిరక్షించే వాణ్ణికదా.. !” అన్న భావన వారి మదిలో కలిగింది. మరుక్షణంలో వారికి గంభీరమైన 'జగన్మాత' మాటలు వినిపించాయి.
'నాస్తికులు నా ఆలయంలో ప్రవేశించి, నా విగ్రహాన్ని పగులగొట్టితే ఏం..? నన్ను రక్షించేది నువ్వా..?, నిన్ను రక్షించేది నేనా..? నాకు యిష్టమైతే కావలసినన్ని మఠాలు, ఆలయాలు కల్పించుకోలేనా..?, అవసరమైతే యీ క్షణంలోనే యిక్కడ ఏడంతస్థుల బంగారు భవనాన్ని లేవదియ్యగలను’.
యీ తల్లి మాటలతో స్వామీజీ హృదయం పులకించింది. వారి మదినిండా ఆ మాతృమూర్తి నిండిపోయింది. అక్టోబర్ 18వ తేదీన అందరితో కలసి కలకత్తాకు స్వామీజీ తిరిగి వచ్చారు. విపరీతమైన చలి, పర్వత ప్రాంత సంచారపు అలసట, చిత్రమైన అనుభవాలు, అనుభూతులు, కారణంగా వారి గుండె వ్యాకోచించింది.
ఉబ్బసం కూడా వారిని బాధించసాగింది. యీ యాత్రతో వారి మనోభావం పూర్తిగా మారిపోయింది. ఆ స్థితిలో స్వామీజీ, శిష్యులకు యిలా తెలియజేశారు.
'ప్రస్తుతం నేను భక్తితో నిండిపోయాను. వయస్సు మళ్ళే కొద్ది జ్ఞానం స్థానాన్ని, భక్తిభావం ఆక్రమిస్తోంది.’
మఠ ప్రతిష్టాపన బేలూరులో జరిగిన తర్వాత కొన్ని నెలలు స్వామీజీవారు సన్యాస శిష్యులకు శిక్షణ జరపటంతో కాలం గడిపారు. ఆ రోజుల్లోనే ఆరోగ్య రక్షణకు వైద్యనాధ్ వెళ్ళి వచ్చారు. తాము ప్రాంభించిన కార్యక్రమాలు పాశ్చాత్యాన ఎలా కొనసాగుతున్నాయో చూచి రావాలనే సంకల్పంతో 1898 సం॥ డిసెంబర్లో పాశ్చాత్య పయనాన్ని గురించి వెల్లడి చేశారు. 1899 సం॥ జూన్ 20వ తేదీన తురీయానందస్వామి, సోదరి నివేదితతో స్వామీజీ రెండవసారి పాశ్చాత్యానికి
ప్రయాణమయ్యారు.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/Qey6vsHI_aE