Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: అశ్వ మేధం - ఎపిసోడ్ - 10 | Aswamedham - Episode - 10 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com
Description: (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
'Aswamedham - Episode - 10' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy
'అశ్వ మేధం - ఎపిసోడ్ - 10' తెలుగు ధారావాహిక
రచన : గన్నవరపు నరసింహ మూర్తి
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
వారం రోజుల తరువాత రాఘవన్ హత్య కేసు మళ్లీ మొదలైంది.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు ఒక సీల్డ్ కవర్ కోర్టుకి సమర్పిస్తూ "డిఫెన్స్ వారు ఆరోపించడం వల్ల పోలీసుశాఖ చక్రపాణి పై ఒక ఎంక్వైరీ ఆర్డర్ చేసింది. దాన్ని ఏఎస్పీ స్థాయి అధికారికి అప్పచెప్పింది; ఈ సీల్డ్ కవర్ లో వున్నది అతనిచ్చిన రిపోర్ట్; ఆ రిపోర్టు ప్రకారం ఇద్దరు నేరస్తులను బీహార్ నుంచి ఒక కేసు విషయమై ఇక్కడకు తీసుకురావడం జరిగింది కానీ వాళ్ళు హత్య జరిగిన సమయంలో లాకప్పులో ఉండటం వల్ల వాళ్ళు హత్య చేసే అవకాశం లేదు. కాకపోతే సాక్షి దీప తాను ప్రత్యక్షంగా చూసాను అని కేసులో చెప్పడంవల్ల వాళ్లను ముద్దాయిలుగా పేర్కొనటం జరిగింది. ఆ మర్నాడు వాళ్ళని వదలి పెట్టడం జరిగింది. మా పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి వారిని బీహార్ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది.
కానీ దురదృష్టవశాత్తు అక్కడ పోలీసులు వాళ్ళని విడిచిపెట్టడంతో వారిని పట్టుకోవడానికి సమయం పడుతోంది. అయినా సరే వారం రోజుల్లో వారిని పట్టుకొని కోర్టువారి ముందు హాజరు పరుస్తాం” అని చెప్పాడు;
వెంటనే చరణ్ లేచి " యువరానర్... ప్రభుత్వ ప్లీడర్ గారు హత్య జరిగిన సమయంలో విక్రమసింగ్, రాంసింగ్ లిద్దరూ లాకప్పు రూమ్ లోనే ఉన్నట్లు చెబుతున్నారు. కానీ సాక్షి దీపగారు మాత్రం వాళ్ళను తాను చూసానని చెబుతున్నారు. ఒక వేళ నిజంగా వాళ్ళు లాకప్పులోనే ఉంటే దీప వాళ్ళ చిత్రాలను ఎలా చిత్రించింది? ఆమె వాళ్ళనెప్పుడు చూడలేదు;పోలీసులు చెబుతున్నట్లు వాళ్ళు హత్య చెయ్యకపోతే వాళ్ళని ముద్దాయిలుగా ఎందుకు చెబుతున్నారు? అప్పుడు వాళ్ళని పట్టుకొని హాజరుపర్చడం వల్ల ఉపయోగ ఏంటి? అంటే ఈకేసులో ప్రభుత్వం సరిగ్గా విచారించలేదని తెలుస్తోంది.
ఒకవేళ ప్రభుత్వ వాదన ప్రకారం వాళ్ళిద్దరూ ముద్దాయిలు కాకపోతే మరి హంతకులెవ్వరు? కేసు పురోగతి, స్టేషన్ రిపోర్ట్ ఎందుకివ్వలేదు? ఏదైన ఈ కేసులో చక్రపాణిని విచారిస్తే చాలా విషయాలు తెలుస్తాయని నాభావన. కాబట్టి కోర్టు వారు చక్రపాణి సి.ఐ. గారిని ఇంటరాగేషన్ చెయ్యడానికి అనుమతివ్వమని కోరుతున్నాను.” అన్నాడు చరణ్ కూర్చుంటూ..
“పెర్మిషన్ గ్రాంటెడ్” అన్నారు జడ్జి.
పది నిముషాల తరువాత చక్రపాణి ని బోనులో ప్రవేశపెట్టారు;
అప్పుడు చరణ్ అతన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు;
"మీ పేరు”
“ చక్రపాణి"
మీరు ఆపోలీస్ స్టేషన్లో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు?
* సుమారు 3 సంవత్సరాల నుంచి ”
“ మీకిది వరకు విక్రమ్ సింగ్ , రామ్ సింగ్ లు తెలుసా?”
“ప్లీజ్.. డోంట్ బీ సిల్లీ.. వాళ్ళు నాకు తెలియడం ఏమిటి?”
" మరి వాళ్ళని అప్ప చెప్పమని బీహార్ ప్రభుత్వానికి ఎందుకు ఉత్తరం రాసారు?”
" రెండు సంవత్సరాల క్రితం వాళ్ల గేంగ్ వచ్చి మన రాష్ట్రంలో ఎన్నో దొంగతనాలు చేసింది. వాళ్లని చెడ్డీ గ్యాంగ్ లని అంటారు. వీళ్లు చాలా తెగింపు కలిగిన ముఠా; అవసరం అయితే ప్రాణాలు కూడా తీస్తారు. సుమారు రెండు నెలలు క్రితం ఈఊళ్లో ఓ ఇంట్లో దొంగతనం జరిగి ఆఇంటి యజమానిని రాడ్ తో కొట్టి చంపారు. ఆ దొంగతనం కేసులో వీళ్ళు అనుమానితులు; అందుకే వాళ్ళని పిలిపించాము.”
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.
Video link
https://youtu.be/0A3ca66RhUY