Want to create an interactive transcript for this episode?
Podcast: Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
Episode: బంగారం లాంటి మనిషి | Bangaram Lanti Manishi | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com
Description:
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)
'Bangaram Lanti Manishi' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy
'బంగారం లాంటి మనిషి' తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
శివపురం లో బంగారం లాంటి మనిషి మా ‘స్వర్ణశ్రీ’ గారు. ఆయన అసలు పేరు అరటికట్ల సోమేశ్వర రావు గారు. ఆయన బంగారం పని చేస్తారు కాబట్టి, ఆయనని అలా పిలుస్తారని మేం చిన్నప్పుడు అనుకున్నాం గానీ, అది ఆయన బిరుదని పెద్దయ్యాక తెలిసింది.
రామచంద్ర రావు పేట లోని ఇంటి దగ్గర నుండి తొమ్మిదింటికి బయల్దేరితే గాంధీ బొమ్మల దగ్గర ఉన్న కొట్టు దగ్గరకు రావడానికి గంట సమయం పట్టేది. అలాగని అది పెద్ద దూరం కాదు. కానీ దారిలో ఆయన్ని పలకరించే మిత్రులు ఎక్కువ. అందువలన అంత సమయం పట్టేది. ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు, విశాలమైన మొహం, ఆ మొహానికి బంగారు రంగు ఫ్రేము ఉన్న, కళ్ళ జోడు, ఆ కళ్ళ జోడు వెనకాల పెద్ద కళ్ళు. ఫాంటు దాని పైన ఫుల్ హాండ్స్ షర్టు తో ఆయన గంభీరంగా నడిచి వస్తుంటే చిత్తూరు నాగయ్య గారే గుర్తుకు వస్తారు.
బీళ్ల అప్పలస్వామి ఇల్లు దాటగానే రేకు పెట్టెలు తయారు చేసే జామి అప్పారావు ని, అతని తమ్ముడు రామా రావు ని ఓసారి పలకరించి గానీ ముందుకు సాగేవారు కాదు ఆయన. ఆ తర్వాత ఆ పక్కనే వడ్రంగి పని చేసే శ్రీరామ మూర్తితో రెండు మాటలు మాట్లాడి వెళ్ళేవారు. ఒకోసారి సబ్బెల్ల పుల్లారెడ్డి కూడా అక్కడే ఉంటె అతన్ని కూడా పలకరించి ముందుకు వెళ్ళేవారు.
“ఏంటి స్వర్ణ శ్రీ గారూ, ఈ మధ్యన ప్రోగ్రాములు ఏమీ లేవా ?” అని పుల్లా రెడ్డి అంటే, గత వారం ఎక్కడికి వెళ్లి వచ్చినదీ చెప్పేవారు స్వర్ణ శ్రీ. కామాక్షీ దేవి గుడి దగ్గరకు రాగానే, ఒకరిద్దరు ఆయన్ని ఆపేవారు. ఎం. ఎల్. ఏ. గారు వస్తే చెప్పమని, తమకున్న ఇబ్బందులు గురించి ఆయనకీ చెప్పే వారు. ఆయన, ఎం. ఎల్. ఏ. గారు వస్తే మీకు తప్పకుండా కబురు చేస్తానని హామీ ఇచ్చి ముందుకు సాగేవారు. ఎం. ఎల్. ఏ. వంక సత్యనారాయణ గారు తణుకు లో ఉంటారు. శివపురం వచ్చినప్పుడు పార్టీ ఆఫీస్ కి వచ్చి కార్యకర్తల్ని, మిత్రుల్ని కలిసి వెళ్తూ ఉంటారు. స్వర్ణశ్రీ గారిని ఆయన తప్పకుండా కలుస్తారు. అదీ అసలు సంగతి.
గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర ఉన్న జవ్వాది వారి షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న చిన్న కొట్టులో ఆయన బంగారం పని చేస్తారు. ఆయన కొట్టు పక్కనే బంగారం కొట్లు ఉన్నాయి. షావుకార్లు అందరికీ స్వర్ణశ్రీ అంటే చాలా గౌరవం. తమ దగ్గరకు వచ్చే ఖాతాదార్లు ఏమైనా బంగారం వస్తువులు చేయించుకోవాలంటే ముందుగా స్వర్ణశ్రీ గారి దగ్గరికే పంపుతారు షావుకార్లు. దానికి తగిన విధంగానే ఖాతాదార్లకు కావాల్సిన బంగారం వస్తువులను తయారు చేసి సరైన సమయానికి వారికి అందించే వారు.
కొట్టు తలుపు తీసి శుభ్రం చేస్తుండగా, పక్కనే ఉన్న బంగారం కొట్టు వీరభద్రం గారు “ఈరోజు అరగంట ఆలస్యం అయ్యింది సారూ” అని నవ్వుతూ పలకరించారు.
‘అవునండి, ఈరోజు మిత్రులతో ఎక్కువసేపు మాట్లాడవలసి వచ్చింది’ అని జవాబిచ్చారు స్వర్ణశ్రీ పని చేసుకుంటూనే.
“ఆ.. కొఠాలపర్రు నాగమణి గారి బంగారు గాజులు అయ్యాయా?”అడిగారు వీరభద్రం.
“ఆ. అయిపోయాయండి. ఇవాళ మెరుగు పెట్టిడం తరవాయి. మధ్యాహ్నం కి రెడీ అయిపోతాయి” అన్నారు స్వర్ణశ్రీ.
Read the full story on www.manatelugukathalu.com
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి.